రా.స్వ.సం. తెలంగాణా ప్రాంత కార్యవాహ ఎక్కా చంద్రశేఖర్ పిలుపు
సేవాభారతి ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 15 మే 2016 ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని తాజ్ ట్రైస్టార్ హోటల్ లో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు 150 మందితో సమావేశం నిర్వహించారు.
సేవాభారతి ఆదర్శవంతంగా, విజయవంతంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ, మున్ముందు నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ, సంవేదన శీలత కలిగిన దాతలు, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలను వాంఛిస్తూ, స్వావలంబన, స్వాభిమాన సమాజ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యులను చేయడమే సేవాభారతి లక్ష్యం. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రాంతంలోని ముఖ్య పట్టణాలు, నగరాలలో సేవాభారతి పరిచయ సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ రజతోత్సవ వేడుక లకు ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త లింగ అశోక్, వక్తలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యవాహ ఎక్కా చంద్రశేఖర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, సికింద్రాబాద్ విభాగ్ సంఘచాలక్ దుర్గారెడ్డి, సేవాభారతి ప్రాంత అధ్యక్షులు డా|| గౌడ జనార్దన్ వేదికనలంకరించారు.
వక్తగా విచ్చేసిన ఎక్కా చంద్రశేఖర్ ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, కేవలం పిలుపునివ్వడమే కాకుండా సేవా కేంద్రాలను నెలకొల్పి సేవలు చేసి చూసిన స్వామి వివేకానందకు ధన్యవాదములు తెలుపుతూ, స్పందించే మనస్సు, సంవేదన శీలత కలిగిన వ్యక్తుల సహాయ సహ కారా లతో సేవాభారతి దేశ వ్యాప్తంగా 1,52,000 సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న దన్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా సమాజ ఉన్నతి కోసం కృషి జరుగుతున్నదన్నారు. పరమాత్మ తత్త్వాన్ని ప్రత్యక్షంగా చూపించే మార్గం సేవ అన్నారు. దానికి ఉదాహరణ వివరిస్తూ ”ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్కు చెందిన, ఉండటానికి సరియైన ఇల్లు కూడా లేని ఒక నిరుపేద మహిళ తన 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వయస్సు గల ఇద్దరు పిల్లలతో బంధువుల ఇంటికి బయలుదేరి, పిల్లలకు దప్పిక వేయడంతో నీళ్ళ కోసం సమీపంలో వెతుకుతూ, డిహైడ్రేషన్కు గురై సొమ్మసిల్లి పడిపోయింది. ఆ మార్గంలో వచ్చినవారు ఆమెకు సపర్యలు చేయగా స్పృహ వచ్చింది. ఆమె నా పిల్లలు దప్పికతో అడవిలో ఉన్నారు. ఎలా ఉన్నారో అంది. అక్కడ అప్పటికే వారు విగత జీవులైనారు”. కనీస అవసరాలు తీర్చు కునే హక్కులు వారికి తెలియవు, తెలిపేవారు లేర న్నారు. మరొక ఉదాహరణలో ”మతి మరుపు వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్ధ మహిళ అర్ధాంతరంగా రైలు దిగి, ఎక్కడికి పోవాలో తెలియక రోడ్ల వెంట తిరుగుతున్నది. ఆమెను గమనించిన సేవా కార్యకర్తలు ఆమె ఇచ్చిన అస్పష్ట వివరాలతో వాళ్ళ కుటుంబానికి చేర్చారు. రెండు రోజులుగా తల్లి జాడ తెలియక దుఃఖంలో ఉన్న పిల్లలు విషయం తెలియడంతో వారి కళ్ళల్లో అంతులేని ఆనందం నిండింది. సభ్య సమాజంలో అందరికి అవసరం ఉంటుంది. పేద- ధనిక భేదం లేదు” అన్నారు.
మన జీవన విధానంలో విధులు, కర్తవ్యం మాత్రమే ఉన్నాయి. దీని ద్వారానే కుటుంబ వ్యవస్థ బలపడి సమాజం రక్షింపబడుతున్నదన్నారు. ఇది మన సంస్కృతి సంస్కారానికి నిదర్శనం. సేవాభారతి సంస్కార సాధన ఉద్యమంగా పనిచేస్తున్నదన్నారు. సమాజ భాగస్వామ్యం, హితైషుల సహకారంతోనే సేవాభారతి 1,52,000 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, పేదల కోసం కాకుండా సేవా కార్యక్రమాల నిర్వహణ కోసమే సహాయాన్ని కోరుతున్న దన్నారు. సేవాభారతి ఇతర సేవాసంస్థలకు పోటీ కాదని, సమాజ ఎదు గుదల కోసం అందరం కలిసి పనిచేయాలని కోరు తు న్నదన్నారు. అందరం కలిసి పని చేస్తే అద్భుతాలు సృష్టించ వచ్చునని, సమా జోన్నతి కోసం అంద రం తమ వంతుగా సహకారం అందించా లన్నారు.
సికింద్రాబాద్లో సేవాభారతి ద్వారా నిర్వహించ బడుచున్న 93 అభ్యాసికలు వీటి ద్వారా సాధిస్తున్న విజయాల గురించి అర్జున్రావు వివరించారు. హైదరాబాద్ మహానగరంలో సేవాభారతి ద్వారా నిర్వహిస్తున్న 140 కిశోరి వికాస కేంద్రాల నిర్వహణ సాధించిన విజయాలు, ప్రాంతమంతటా విస్త రించవలసిన ఆవశ్యకత గూర్చి కుమారి సురేఖ వివరించారు.
గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి నిర్వహిస్తున్న షెల్టర్ ¬మ్, వివిధ హెల్ప్ డెస్కులు, రక్తదాతల సూచి, ఉచిత వైద్య శిబిరాల గురించి వివరించి ప్రభుత్వం, సమాజం నుండి వస్తున్న ప్రోత్సాహాల గురించి, వీటిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం ఇతర ఆసుపత్రుల్లో కూడా అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం గురించి నర్సింహమూర్తి వివరించారు. జిజ్ఞాస సంచార ప్రయోగాల ద్వారా 30 వేలమంది విద్యార్థులు 45 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న విషయం, అక్కడి స్పందనల గురించి రామేశ్వర్ వివరించారు.
సేవాభారతి ప్రాంత కార్యదర్శి వెరబెల్లి రఘునాథ్ సేవాభారతి ద్వారా జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా సాధిస్తున్న విజయాలు, వాటి ప్రత్యేకతల గురించి వివరించారు. అనంత్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.