Quantcast
Channel: Sevabharathi Telangana
Viewing all 1426 articles
Browse latest View live

సేవాభారతి కిశోరి వికాస్ వార్షికోత్సవం : Kishori Vikas Bhainsa

$
0
0
May 11 2016
సేవాభారతి కిశోరి వికాస్ వార్షికోత్సవం ఈరోజు సాయంత్రం AP nagar mahisha లో జరిగింది .రామకృష్ణ సేవ సంఘం (వివేకానంద ఆవాసం మహిష ) ద్వారా ఇక్కడ బాల సంస్కర కేంద్రం నడుస్తుంది భాగ్యనగరం నుండి 4 గురు బాలికలు 7 రోజులు ఇక్కడి పిల్లలకు డాన్సు ,పాటలు ,అల్లికలు నేర్పినారు .ఈరోజు ఇక్కడ చక్కని దేశభక్తి .బతుకమ్మ కోలాటాలతో ఆకట్టుకొన్నారు .కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమతి రాణి చందూలాల్ గారు వక్తగా శ్రీ నారాయణ్ సార్ పాల్గొన్నారు






Sevabharathi Telangana celebrates SilverJubilee 2016 in Secunderabad

$
0
0
 Sevabharathi Telangana celebrates SilverJubilee 2016 reaching out to interior & unreached needy. The organisation has taken up awareness and reachout programmes to all the sections of the society. As part of the effort it has also organised Donors Meet to thank the people that have stood and are selflessly supporting the activities in whatever small way they can.

The programme in Secunderabad was organised at Taj Tristar hotel and attended by 150 donors and well wishers.

Sevabharathi Medical Camp for urban poor

$
0
0
Sevabharathi Medical Camp for urban poor 16 volunteers & 125 patients 3 doctors including 1 lady doctor through Sanjeevani Mobile Dispensary



Sevabharathi Medical Camp organised by IT Milan at siddiqui nagar, Gachibowli  Hyderabad Sanjeevani Mobile Dispensary

సేవే వూపిరి.. .ఆశయమే ఆవాసం : వివేకానంద ఆవాస విద్యాలయం

$
0
0
న్యూస్‌టుడే, రామాయంపేట

 ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న. 
ఎదుటి వారి కష్టాలను చూసి బాధపడటం కాదు.. వారికి చేయూత అందించాలి.. 

అన్నదానం కంటే విద్యాదానం గొప్పది.. 

ఇలా మహాత్ముల ఆశలు, ఆశయాలను వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్ఫురించిన ఆలోచనే నేడు ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. తనతో పాటు మరికొంతమందిని కలుపుకుని దాతల సాయంతో నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, నీతినిజాయతీ, దేశభక్తి గల పౌరులను అందించడానికి మలివయసులోను(70) అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

ఆయనే రామాయంపేట పట్టణంలోని వివేకానంద ఆవాస విద్యాలయం వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి. రామాయంపేట పట్టణంలోని మెదక్‌ రోడ్డుపై సువిశాలమైన మూడున్నర ఎకరాల్లో కొనసాగుతున్న ఆవాస విద్యాలయం ఏర్పాటుకు కృష్ణారెడ్డి కృషి ఎనలేనిది. అయితే రామాయంపేట మండలంలో విద్యుత్తు శాఖలో ఏఈగా పని చేసిన కృష్ణారెడ్డి 1981లో గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన సమయంలో చదువు లేక పేదరికంతో బాధపడుతున్న వారిని చూసి చలించిపోయారు. బతుకులు బాగుపడాలంటే చదువే అసలైన మార్గమని ఎంచుకున్న ఆయన వారి కుటుంబాలో వచ్చే తరానికి విద్యతో వెలుగు నింపాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా వ్యవసాయ బావులకు విద్యుత్తు ఏర్పాటు కోసం వచ్చే రైతులతో మాట్లాడి విరాళాల సేకరణకు ఉపక్రమించారు. 

ఆయన సేవాతత్పరతను గమనించిన సామాన్య రైతులు సైతం తమకు తోచిన సాయం అందించడానికి ముందుకొచ్చారు. దీంతో 280 మంది విద్యార్థులతో సరస్వతి శిశుమందిర్‌ను ప్రారంభించారు. నాడు ఉద్యోగిగా.. నేడు విశ్రాంత ఉద్యోగిగా నిరుపేద విద్యార్థులకు చేయూత అందిస్తూనే ఉన్నారు. 

ఆవాసంగా రూపాంతరం.. 

కాలగమనంలో ఆంగ్లంపై మోజు పెరుగుతున్న తరుణంలో ప్రైవేటు పాఠశాలలు రంగ ప్రవేశం చేశాయి. ఆకర్షణీయ ప్రకటనలతో దూసుకువస్తున్న వాటివైపు తల్లిదండ్రులు ఆకర్షితులయ్యారు. దాంతో శిశుమందిర్‌లో క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాలను మూసివేశారు. కానీ ఆయన ఆయన నిరుత్సాహపడకుండా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మరోవిధంగానైనా పేదలకు సేవలు అందించాలనే తపనతో కృషి చేశారు. 

సేవాభారతి అనుబంధంగా అనేక మంది దాతల సహకారంతో 2006 అక్టోబరులో భోజనం, వసతి ఏర్పాటుతో 25 మంది విద్యార్థులతో వివేకానంద ఆవాస విద్యాలయంగా పునరుద్ధరించారు. ప్రైవేటు పాఠశాలల సహకారం.. ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు సహాయ, సహాకారాలు అందిస్తూ ప్రోత్సహించాలన్న తపనతో కృష్ణారెడ్డి చేస్తున్న కృషికి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సైతం తమవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఆవాసంలోని నిరుపేద విద్యార్థులకు 50 శాతం ఫీజు మాఫీకి అంగీకరించాయి. మిగిలింది ఆవాసం ద్వారా చెల్లిస్తున్నారు. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నా.. ఆవాస విద్యాలయంలో వసతి, భోజన సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటు ఒక ఉపాధ్యాయుడిని (ఆవాస ప్రముఖ్‌) ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇతర సంస్కారాలను బోధిస్తున్నారు. 

సంస్కృతి, సంప్రదాయాలు విద్యతో పాటు విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి వివిధ రకాల అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నృత్యాలు, సంస్కృతి, సంప్రదాయాలలో తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం సూర్యనమస్కారాలు, సాయంత్రం సంధ్యా వందనంతో పాటు యోగా, స్వయంరక్షణ కోసం కరాటే, కుంగ్‌ఫూ, కర్రసాము, ఏకాగ్రత కోసం ధ్యానం వంటివి నిత్యం సాధన చేయిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించేందుకు మహాత్ముల జీవిత చరిత్ర పుస్తకాలను వారి చేత చదివిస్తుండటం గమనార్హం. 

నిర్వాహకుల సంకల్పానికి అనుగుణంగా ఇందులో నివాసం ఉంటున్న విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా నిలుస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ్‌ ఎల్లవేళలా వారితోనే ఉంటూ మంచి చెడులను చూస్తున్నారు. 60 మంది విద్యార్థులకు ఆశ్రయం.. మహాయజ్ఞంలా చేపట్టిన ఆవాస విద్యాలయంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృష్ణారెడ్డి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ఆవాస విద్యాలయ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు 29 మంది సేవాతత్పరతను కలిగిన సంఘ సేవకులతో 2009లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వ్యాపారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన దాతల నుంచే అందే సహకారంతో నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

 ప్రస్తుతం 60 మంది నిరుపేద విద్యార్థులు ఆవాసంలో ఆశ్రయం పొందుతున్నారు. కమిటీ సభ్యులు సైతం వారి సంక్షేమం తమ బాధ్యతగా భావించి రోజూ ఆవాసాన్ని సందర్శిస్తారు. అవసరం మేర వసతులు కల్పిస్తారు. వీరి ఆధ్వర్యంలో ఏటా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విజ్ఞాన కేంద్రాలకు విద్యార్థులను విజ్ఞానయాత్రకు తీసుకెళ్తుండటం విశేషం. విజ్ఞానం కోసం అన్ని అంశాల్లో విజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో మహాత్ములు, దేశభక్తి, స్వాత్రంత్య్ర సమరయోధులు, మన దేశ సంప్రదాయాల పుస్తకాలతో కూడిన ఓ కొత్త భవనాన్ని నిర్మించారు. ఇందులో సుమారు 500 పుస్తకాలు ఉన్నాయి. 

అంతేకాక సాంకేతిక సృజనకు కంప్యూటర్‌ విద్య సైతం అందిస్తున్నారు. వీటితోపాటు ఆవాస విద్యాలయం ఆధ్వర్యంలో గ్రామాల్లో 17 బాల సంస్కార కేంద్రాలు, 15 సంచీ గ్రంథాలయాలు, 3 కిశోరీ వికాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అలాగే గోమాత రక్షణే ధ్యేయంగా వేదమాత గోసంరక్షణ సమితి పేరుతో ఇప్పటికే 44 ఆవులను రైతులకు అందించారు. అన్ని అంశాలను..: కృష్ణారెడ్డి, ఆవాస విద్యాలయం వ్యవస్థాపకులు ప్రతిభ ఉన్నా చదువుకోలేని నిరుపేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. వారికి చదువుకునే వాతావరణం ఉండక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో ఆవాస విద్యాలయాన్ని నెలకొల్పాం. అన్ని అంశాల్లో వారికి శిక్షణ ఇస్తున్నాం. వారి కాళ్ల మీదే వాళ్లే నిలబడేలా తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం కంప్యూటర్‌ విద్య సైతం ప్రవేశపెట్టాం. 

Source: EENADU

Sevabharathi Secunderabad: Kotyala Abhyasikas Children summer camp

$
0
0
 Kotyala Abhyasikas Children summer camp held Govt. high school 150 children 100 parents #Sevabharathi Secunderabad


Damarakunta Abhyasikas annual day and summer camp

$
0
0
19 May
Damarakunta Medak Dist, Abhyasikas annual day and summer camp conclusion programme held at Govt High School. 200 children, 500 parents and villagers participated. The chief guest was the sarpanch of the village. The entire school ground was full and people even viewed the programme from surrounded buildings.


సేవాభారతి సంస్కార సాధన ఉద్యమంగా పనిచేస్తున్నది

$
0
0
రా.స్వ.సం. తెలంగాణా ప్రాంత కార్యవాహ ఎక్కా చంద్రశేఖర్‌ పిలుపు
సేవాభారతి ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 15 మే 2016 ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లోని తాజ్‌ ట్రైస్టార్ హోటల్ లో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు 150 మందితో సమావేశం నిర్వహించారు.

సేవాభారతి ఆదర్శవంతంగా, విజయవంతంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ, మున్ముందు నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ, సంవేదన శీలత కలిగిన దాతలు, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలను వాంఛిస్తూ, స్వావలంబన, స్వాభిమాన సమాజ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యులను చేయడమే సేవాభారతి లక్ష్యం. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రాంతంలోని ముఖ్య పట్టణాలు, నగరాలలో సేవాభారతి పరిచయ సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ రజతోత్సవ వేడుక లకు ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త లింగ అశోక్‌, వక్తలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ తెలంగాణ ప్రాంత కార్యవాహ ఎక్కా చంద్రశేఖర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త, సికింద్రాబాద్‌ విభాగ్‌ సంఘచాలక్‌ దుర్గారెడ్డి, సేవాభారతి ప్రాంత అధ్యక్షులు డా|| గౌడ జనార్దన్‌ వేదికనలంకరించారు.

వక్తగా విచ్చేసిన ఎక్కా చంద్రశేఖర్‌ ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, కేవలం పిలుపునివ్వడమే కాకుండా సేవా కేంద్రాలను నెలకొల్పి సేవలు చేసి చూసిన స్వామి వివేకానందకు ధన్యవాదములు తెలుపుతూ, స్పందించే మనస్సు, సంవేదన శీలత కలిగిన వ్యక్తుల సహాయ సహ కారా లతో సేవాభారతి దేశ వ్యాప్తంగా 1,52,000 సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న దన్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా సమాజ ఉన్నతి కోసం కృషి జరుగుతున్నదన్నారు. పరమాత్మ తత్త్వాన్ని ప్రత్యక్షంగా చూపించే మార్గం సేవ అన్నారు. దానికి ఉదాహరణ వివరిస్తూ ”ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూర్‌కు చెందిన, ఉండటానికి సరియైన ఇల్లు కూడా లేని ఒక నిరుపేద మహిళ తన 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వయస్సు గల ఇద్దరు పిల్లలతో బంధువుల ఇంటికి బయలుదేరి, పిల్లలకు దప్పిక వేయడంతో నీళ్ళ కోసం సమీపంలో వెతుకుతూ, డిహైడ్రేషన్‌కు గురై సొమ్మసిల్లి పడిపోయింది. ఆ మార్గంలో వచ్చినవారు ఆమెకు సపర్యలు చేయగా స్పృహ వచ్చింది. ఆమె నా పిల్లలు దప్పికతో అడవిలో ఉన్నారు. ఎలా ఉన్నారో అంది. అక్కడ అప్పటికే వారు విగత జీవులైనారు”. కనీస అవసరాలు తీర్చు కునే హక్కులు వారికి తెలియవు, తెలిపేవారు లేర న్నారు. మరొక ఉదాహరణలో ”మతి మరుపు వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్ధ మహిళ అర్ధాంతరంగా రైలు దిగి, ఎక్కడికి పోవాలో తెలియక రోడ్ల వెంట తిరుగుతున్నది. ఆమెను గమనించిన సేవా కార్యకర్తలు ఆమె ఇచ్చిన అస్పష్ట వివరాలతో వాళ్ళ కుటుంబానికి చేర్చారు. రెండు రోజులుగా తల్లి జాడ తెలియక దుఃఖంలో ఉన్న పిల్లలు విషయం తెలియడంతో వారి కళ్ళల్లో అంతులేని ఆనందం నిండింది. సభ్య సమాజంలో అందరికి అవసరం ఉంటుంది. పేద- ధనిక భేదం లేదు” అన్నారు.


మన జీవన విధానంలో విధులు, కర్తవ్యం మాత్రమే ఉన్నాయి. దీని ద్వారానే కుటుంబ వ్యవస్థ బలపడి సమాజం రక్షింపబడుతున్నదన్నారు. ఇది మన సంస్కృతి సంస్కారానికి నిదర్శనం. సేవాభారతి సంస్కార సాధన ఉద్యమంగా పనిచేస్తున్నదన్నారు. సమాజ భాగస్వామ్యం, హితైషుల సహకారంతోనే సేవాభారతి 1,52,000 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, పేదల కోసం కాకుండా సేవా కార్యక్రమాల నిర్వహణ కోసమే సహాయాన్ని కోరుతున్న దన్నారు. సేవాభారతి ఇతర సేవాసంస్థలకు పోటీ కాదని, సమాజ ఎదు గుదల కోసం అందరం కలిసి పనిచేయాలని కోరు తు న్నదన్నారు. అందరం కలిసి పని చేస్తే అద్భుతాలు సృష్టించ వచ్చునని, సమా జోన్నతి కోసం అంద రం తమ వంతుగా సహకారం అందించా లన్నారు.

సికింద్రాబాద్‌లో సేవాభారతి ద్వారా నిర్వహించ బడుచున్న 93 అభ్యాసికలు వీటి ద్వారా సాధిస్తున్న విజయాల గురించి అర్జున్‌రావు వివరించారు. హైదరాబాద్‌ మహానగరంలో సేవాభారతి ద్వారా నిర్వహిస్తున్న 140 కిశోరి వికాస కేంద్రాల నిర్వహణ సాధించిన విజయాలు, ప్రాంతమంతటా విస్త రించవలసిన ఆవశ్యకత గూర్చి కుమారి సురేఖ వివరించారు.

గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి నిర్వహిస్తున్న షెల్టర్‌ ¬మ్‌, వివిధ హెల్ప్‌ డెస్కులు, రక్తదాతల సూచి, ఉచిత వైద్య శిబిరాల గురించి వివరించి ప్రభుత్వం, సమాజం నుండి వస్తున్న ప్రోత్సాహాల గురించి, వీటిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం ఇతర ఆసుపత్రుల్లో కూడా అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం గురించి నర్సింహమూర్తి వివరించారు. జిజ్ఞాస సంచార ప్రయోగాల ద్వారా 30 వేలమంది విద్యార్థులు 45 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న విషయం, అక్కడి స్పందనల గురించి రామేశ్వర్‌ వివరించారు.

సేవాభారతి ప్రాంత కార్యదర్శి వెరబెల్లి రఘునాథ్‌ సేవాభారతి ద్వారా జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా సాధిస్తున్న విజయాలు, వాటి ప్రత్యేకతల గురించి వివరించారు. అనంత్‌ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

A Session with New Nursing Staff :Sevabharathi in association with Ekam foundation

$
0
0
Sevabharathi in association with Ekam foundation organised a Session with the New Nursing staff at Gandhi Hospital

#Sevabharathi #Telangana state level full time #volunteers training programme

$
0
0
A 3 day Sevabharathi Telangana state level full time volunteers training programme was held at Saraswati Sishu mandir, Saidabad hyderabad.
51 volunteers, teachers, Affection home incharges, co-ordinators attended the trainig programme.




Affection home children attend 40 day Summer camp at Aksharavanam

$
0
0
53 children of Affection homes run by Sevabharathi participated in 40 day Summer camp organised by Vandemataram Foundation at Aksharavanam Kalwakurthy.









Little Teachers, Little leaders - Summer camp started on 21st April 2016 for 40 days.
vandemataram Foundation made all arrangements at Aksharavanam, Kalvakurthy for these 500 students for 40 days.
This camp has daily timetable including Educational, meditation, cultural, crafts, reading, games and sports to fit all children interests.
Main objective of the program is to groom these students as little teachers, when they go back to their schools after reopen they will be helpful to facilitators to run the learning centres in their schools.
Team welcomes all of you to visit the camp anyday of your choice and feedback on the work.

Sattupally in Khammam gets a taste of Kishori Vikas Volunteering for a change

$
0
0
 everything is good experiance with this one week programmm....we learn many things thanku so much every one give a special memorable days in our lives..
Conducted kishori vikas centers in 3 places at
 sattupally..Rajivnagar colony with 26 students , 
varalaxmi appartments with 18 students and 
viratnagar with 35 no.of students.

Vistarak Surekha ,Swapna and chaitanya from Dundigal









ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉండే బస్తీలలో – సేవాభారతి - ఐటి మిలన్స్‌ ఆరోగ్య శిబిరం

$
0
0
ఐటి మిలన్‌ స్వయంసేవకులు సేవాభారతి సహకారంతో మే 15 న సిద్ధిక్‌ నగర్‌, గచ్చిబౌలి సవిూపంలో అట్టడుగు వర్గాల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా భద్రతా సిబంది, పని వారు , వంటమనుషులు , మరియు డ్రైవర్లు నివసిస్తున్నారు . జనాభా చాలా వరకు , అస్సాం , బెంగాల్‌, ఒరిస్సా వంటి తూర్పు మరియు ఈశాన్య భారతం నుండి వచ్చినవారు.
సుమారు 125 మంది ఈ శిబిరంలో చికిత్స తీసుకున్నారు. ఈ శిబిరం సాయంకాలం 5 గం|| కు మొదలుకుని రాత్రి 9 గం|| వరకు జరిగింది.
డాక్టర్‌ చంద్ర భూషణ్‌, డాక్టర్‌ అనుపా మరియు డాక్టర్‌ చక్రపాణి ఈ శిబిరానికి వారి సేవలు అందించారు. 15 మంది ఐటి మిలన్స్‌ స్వయం సేవకులు ఈ శిబిరం లో స్వచ్ఛందంగా సేవలందిం చారు. ఎలాంటి కర పత్రాలు ఉపయోగించకుండా వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి పరిచయం చేసుకోవడం ద్వారా 600 పైగా నివాసితులతో సంప్రదింపులు జరపడం విశేషం.

Sevabharathi Secunderabad : Sanjeevani free mobile Medical camp at Boduppal

$
0
0
Sevabharathi Secunderabad runs a free Mobile dispensary to reach the urban slum dwellers in and around Hyderabad - Secunderabad twin cities. T

he Mobile dispensary SANJIVANI visits 59 slums in and around the twin cities. On june 13th Sanjivani free mobile Medical camp was conducted at Boduppal on the outskirts of hyderabad. The camp in this remote outskirts slum was attended by 2 doctors and 65 members patients.




రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్. లక్ష్మారెడ్డి: సేవాభారతి లాంటి ఎన్నో సేవా సంస్థలు ముందుకు వచ్చి అన్ని రకాలుగా ఆసుపత్రిలో సేవలు అందించడానికి తమతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషకరO

$
0
0

పేదలకు మరింత అందుబాటులోకి వైద్య సేవలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi

సికింద్రాబాద్, జూన్ 16: వైద్యాన్ని పేదలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి ఆధ్వర్యంలో సుఖీభవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాత్రి సమయంలో రోగుల బంధువులకు భోజనాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు అత్యవసర విభాగంలో కొత్తగా 20 స్ట్రెచ్చర్‌లను సేవాభారతి ఆధ్వర్యంలో ఉచితంగా ఆసుపత్రికి అందించే కార్యక్రమాన్ని మంత్రి పర్యవేక్షించారు. అనంతరం అత్యవసర విభాగంలో శాసన సభా పక్షనాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్.లక్ష్మణ్‌తో పాటు అధికారులు, వైద్యులతో కలిసి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో రోగులను పరామర్శించడంతో పాటు వైద్యసేవలను పర్యవేక్షించారు. 

అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న స్వామి శివానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్మించిన భవంతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది లేరని, అయినప్పటికి ఉన్నవారితోనే నెట్టుకు వస్తున్నట్టు చెప్పారు.

 రోజురోజుకు పెరుగుతున్న రద్దీతో ఉన్న సిబ్బందితో ఇబ్బందే అయినప్పటికీ సేవాభారతి లాంటి ఎన్నో సేవా సంస్థలు ముందుకు వచ్చి అన్ని రకాలుగా ఆసుపత్రిలో సేవలు అందించడానికి తమతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. పరికరాలతోపాటు సిబ్బందిని ఇవ్వడం, భోజన వసతి ఏర్పాట్లను ఏర్పాటు చేయడం, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి వైద్యులకు, రోగులకు సహకరించడం లాంటి ఎన్నో మహత్కర కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఎంతోమంది సామాజిక సేవ చేయాలన్న తపన ఉన్నప్పటికీ వారికి సరైన వేదిక దొరకకుండా ఉంటారని అలాంటి వారిని సేవాభారతి ఒక్కతాటిపైకి తీసుకువచ్చి సేవా కార్యక్రమాలను విస్తృత పర్చడం కొనియాడదగిన అంశంగా మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విరివిగా కొనసాగాలని అందరం కలిసి తెలంగాణలోని పేదప్రజలకు సేవ చేద్దామని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

అదే సమయంలో పుట్టుకతోనే వ్యాధిగ్రస్తులుగా ఉన్న చిన్నారులను గుర్తించి మెరుగైన వైద్యం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.కె.వి.రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. మూర్తి, డాక్టర్. జనార్థన్, డాక్టర్. ప్రతాప్‌రెడ్డి, గుణరంజన్, రేఖాశ్రీనివాస్,సుఖీభవ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుధాకర్, అధికారులు రమణి తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్యమంత్రికి వినతిపత్రాలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం గాంధీ ఆసుపత్రికి విచ్చేసిన సందర్భంగా పలువురు ఆసుపత్రి సిబ్బంది తమ గోడును వెల్లబోసుకుంటూ వినతిపత్రాలను అందజేశారు. తమకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి దగ్గర మొరపెట్టుకున్నారు. తమను ఆరోగ్యశ్రీ విభాగం ద్వారా జీఓ నెంబర్ 3లో భాగంగా జీతాలు చెల్లించారని అన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓనెంబర్ 3లో ఉన్న వారిని జీఓనెంబర్ 14లోకి తీసుకురావాలని ప్రకటించిందని అన్నారు. అయితే అందరికీ ఈ నిబంధనను అందుబాటులోకి తీసుకువచ్చి జీతాలు పెంచిన అధికారులు గాంధీ, ఉస్మానియా సిబ్బందిని మాత్రం పక్కన పెట్టారని మంత్రికి తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ సమస్యను పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని వారు మంత్రిని కోరారు. అందుకు మంత్రి సానుకూలగా స్పందించడంతో సిబ్బంది వెనుదిరిగారు.

Source http://www.andhrabhoomi.net/content/hyd-1123

Punjab National Bank donates Mike set to Sri Vidyaranya Awasam Warangal

$
0
0
సేవాభారతి ఆద్వర్యంలో వరంగల్ జిల్లా, మడికొండలో కళాశాల విద్యార్థుల కొరకు నిర్వహించబడుతున్న శ్రీ విద్యారణ్య ఆవాసంనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు మైక్ సెట్ ను బహూకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సేవా భారతి జిల్లా కార్యదర్శి హనుమా రెడ్డి గారు స్థానికంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
     1. కళాశాల విద్యార్థుల కొరకు విద్యారణ్య ఆవాసం
     2. నిరుద్యోగులకు కౌశల్యం వృత్తి విద్యా శిక్షణ
     3. స్థానిక పేద విద్యార్థులకు తక్కువ రుసుము తో 1 నుంచి   10 వరకు  ఇంగ్లిష్ మరియు తెలుగు మాధ్యమంలో వేదవ్యాస  పబ్లిక్ స్కూల్ పేరుతో పాఠశాల నిర్వహణ
    4. మడికొండ సమీపంలో 10 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ వ్యక్తిత్వ వికాసంనకు శిక్షణ ఇచ్చి చదువు పై శ్రద్ద పెంచుటకు కృషి చేస్తున్నారు
   5. స్థానిక విద్యార్థినీ విద్యా ర్థులకు కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నారు.
   6. స్థానిక మహిలలకు కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణ ఇప్పించి ఆర్థిక అభివృద్దికి తోడ్పడుతున్నారు అని వివరించారు.

 ఈ సందర్భంగా ముఖ్య  అతిథి గా విచ్చేసిన పి ఎన్ బి సౌత్ జోన్ మోనేజర్ గారయిన శ్రీ వినోద్ జోషి గారు మాట్లాడుతూ ఈ ఆవాసంలో వృత్తి  శిక్షణ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ముద్ర బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయుటకు అలాగే ఉన్నత విద్యనభ్యసంచుటకు విద్యారుణాలిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ హెడ్ గారు, జిల్లా సేవా ప్రముఖ్ బండ కాళిదాస్ గారు తదితరులు పాల్గొన్నారు


Sevabharathi has celebrated the 2nd international yoga day at Sivananda Ashramam

$
0
0
Sevabharathi has celebrated the 2nd international yoga day at Sivananda Ashramam, Padmaraonagar in association with Divine Life Society (Sivananda Ashramam).

142 persons participated, Swamy Tatvavedanthananda has blessed the function and participated in yoga asanas.

The three yoga guru's were facilitated .





S&P Global visit to Sri Vidyaranya Awasam

$
0
0
 Sri Vidyaranya Awasam is a college students hostel for children from Seva Bharathi run Orphanages, Child Labour Rehabilitation Centers and Affection Homes
 S&P Global donated Carpets, Fans, Sports Kit and Chairs to Sri Vidyaranya Awasam.

 Tree Plantation by S&P Global volunteers at Sri Vidyaranya Awasam (College Students)
 Career counselling to College Students of Sri Vidyaranya Awasam by S&P Global volunteers

సేవాభారతి.. సేవే పరమావధి :: నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ

$
0
0
సేవాభారతి.. సేవే పరమావధి 
నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ 
మడికొండ, న్యూస్‌టుడే 
ఉన్నత చదువులు లేని యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు రాక.. ఉపాధి అవకాశాలు లేక నిరుత్సాహానికి గురవుతుంటారు. అటువంటి వారికి బాసటగా నిలుస్తోంది మడికొండలోని సేవాభారతి సంస్థ. వేలకు వేలు వెచ్చించినా లభించని వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ నిరుద్యోగ యువతకు చేయూతనిస్తోంది ఈ సంస్థ. యువతకు, మధ్య తరగతి మహిళలకు.. కుట్టుపని, బ్యూటీషియన్‌, ఫ్రిజ్‌, ఏసీ, కూలర్ల మెకానిజం తదితర ఉపాధి అంశాల్లో తర్ఫీదునిస్తూ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. స్వయంఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేలా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహమందిస్తోంది. మడికొండలోని వేదవ్యాస పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సేవాభారతి రెండు రకాల సేవా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహిస్తోంది. ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులను కళాశాలల్లో చేర్పించి చదివిస్తోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వివిధ ఉపాధి కోర్సుల్లో నిపుణులతో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు భావ వ్యక్తీకరణ, ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థినులకు బ్యూటీషియన్‌, మహిళలకు టైలరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. యువతకు సెల్‌ఫోన్‌, ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌లకు మరమ్మతులు చేయడంలో ప్రముఖ కంపెనీలకు చెందిన నిపుణులతో శిక్షణ ఇస్తోంది. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వదిలేయకుండా వారికి వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు సేవా భారతి వారధిగా నిలుస్తోంది. ఈ సంస్థలో ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారి అభిప్రాయాలివీ.. 

ఉపాధిపై దిగులు పోయింది
సాయికిరణ్‌, ఏసీ, కూలర్‌, ప్రిజ్‌ మెకానిక్‌
నేను ఐటీఐ చదివాను. మడికొండలోని సేవాభారతిలో ఏసీ, కూలర్లు, ప్రిజ్‌లకు మరమ్మతులు చేయడంలో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. గోద్రేజ్‌ కంపెనీ ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నా ముగ్గురు స్నేహితులతో కలిసి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. నాతో పాటు శిక్షణ పొందిన పదిహేను మందికి వివిధ కంపెనీల్లో ఉపాధి లభించింది. నేను తరచూ ఈ శిక్షణ కేంద్రానికి వచ్చి మెలకువలు నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను. ప్రస్తుతం నాకు, నా స్నేహితులకు ఉపాధిపై దిగులు పోయింది.

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నాను
వై.వర్షిత, ఇంటర్‌ విద్యార్థిని
నేను వేసవి సెలవుల్లో మడికొండ వేదవ్యాస పాఠశాల ఆవరణలోని సేవాభారతిలో ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీస్‌ తరగతులకు వెళ్లాను. ప్రస్తుతం పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలను ఆంగ్లంలోనే నిర్వహిస్తున్నారు. అంతే కాక నేటి ఆధునిక ప్రపంచంలో ఆంగ్లం తప్పనిసరిగా రావాలనే పట్టుదలతో నేర్చుకున్నాను. పది రోజుల వ్యవధిలోనే నేను బిడియం లేకుండా ఆంగ్లంలో మాట్లాడాను. ఇక మీదట సేవాభారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరై వివిధ ఉపాధి కోర్సులను నేర్చుకుంటాను. బాలికలు, మహిళలు అనుసరించాల్సిన వస్త్రధారణ, సంస్కారం వంటి అంశాలను బాగా వివరించారు.

కుట్టుపై పట్టు వచ్చింది
శ్రీవిద్య, టైలరింగ్‌ నేర్చుకున్న మహిళ
మా పిల్లలను పాఠశాలకు పంపించిన తర్వాత ఏం చేయాలో తోచేది కాదు. మడికొండ వేద వ్యాస పాఠశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచితంగా టైలరింగ్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. శిక్షణలో చేరి కుట్టు పనులు నేర్చుకున్నాను. పది రోజుల వ్యవధిలో కొన్ని మాత్రమే నేర్చుకున్నానన్న నిరాశ నాలో ఉంది. మరో పదిరోజులు నేర్పిస్తే పిల్లల దుస్తులు కూడా కుట్టడం నేర్చుకునే అవకాశం ఉండేది. మొత్తానికి మిషన్‌పై కూర్చోవడం కూడా తెలియని నాకు కుట్టులో పట్టు వచ్చింది.

అందంపై మక్కువతో నేర్చుకున్నా
- శృతి, డిగ్రీ విద్యార్థిని
నేను అందంపై మక్కువతో సేవా భారతిలో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకున్నాను. ఫేషియల్‌, హెన్నా, పెడిక్యూర్‌ వంటి అంశాలను శిక్షణలో నేర్పించారు. ఇంట్లో లభించే పదార్థాలతో మేకప్‌ ఎలా వేసుకోవాలి. అందంగా ఎలా తయారు కావాలి అనే విషయాలను నేను బాగా నేర్చుకున్నాను. అంతేకాకుండా మా ఇంట్లో వాళ్లకు ఫేషియల్‌ చేసి శభాష్‌ అనిపించుకున్నాను. స్పోకెన్‌ ఇంగ్లీషులో కూడా శిక్షణ తీసుకున్నాను. ఒకసారి బ్యుటీషియన్‌, ఆంగ్లం నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సేవాభారతిలో అందించే కోర్సులను అందరూ ఉపయోగించుకోవాలి. ఎవరో ఉద్యోగం ఇస్తారని ఎదురు చూడకుండా మనమే

టెక్నిషియన్‌గా ఎదగాలి. .
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సేవలు
-సత్యం, సేవాభారతి నిర్వాహకుడు
సేవాభారతి రాష్ట్ర వ్యాప్తంగా 15 శాఖలను ఏర్పాటు చేసి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ, బాల సంస్కార కేంద్రాలు, ట్యూషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మడికొండలో ఏర్పాటు చేసిన సేవాభారతిలో మొదటి బ్యాచ్‌ ద్వారా 20 మందికి ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌ల మరమ్మతుల్లో శిక్షణ ఇచ్చాం. కొందరికి ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి లభించింది. ఇంకా మహిళలు, విద్యార్థుల కోసం తక్కువ వ్యవధిలో కొన్ని కోర్సులను రూపొందించి నేర్పిస్తున్నాం. యువత నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నాం.


Source: http://archives1.eenadu.net/06-18-2016/district/inner.aspx?dsname=Warangal&info=wgl-sty4

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి

$
0
0
గాంధీఆస్పత్రి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు, వారి సహాయకులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి అన్నారు. గురువారంసేవాభారతి,యూసీడీ (యునైటెడ్ కేర్ డెవలప్‌మెంట్) స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రోగులను తరలించేందుకు 40 స్ట్రెచర్లను ఆస్పత్రికి అందించారు. కార్యక్రమానికి మంత్రి లకా్ష్మరెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మణ్ హాజరయ్యారు. అనంతరం శివానందాశ్రమంలో రోగి సహాయకులకు నిత్యఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పేదలకు సేవలందించే ప్రతి సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సేవాభారతి,యూసీడీ సంస్థలు ప్రత్యేకంగా 15 మంది నర్సులను ఏర్పాటు చేసి సేవలందించడం అందరికీ ఆదర్శనీయమన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని, వారికి సేవలందించేందుకు సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. సామాజిక సంస్థలు సేవా దృక్పథంతో పేద రోగులకు చేయూతనందించేందుకు ముందుకురావడాన్నిస్వాగతిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సేవాభారతి, యూసీడీ సంస్థల ప్రతినిధులతో పాటు డీఎంఈ డాక్టర్ రమణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జేవీ రెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ శేశాద్రి, డాక్టర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.


Source: http://namasthetelangaana.com/

Vandemataram Foundation camp for 280 Sevabharathi Avasam students at Aksharavanam

$
0
0
Sevabharathi Telangana Vandemataram Foundation camp for 280 students of 13 Chatrawas Aksharavanam

10 day Language Logic LifeSkills camp
 Children Performing Yoga & Pyramids



Viewing all 1426 articles
Browse latest View live